Wednesday, December 10, 2008

సినిమా దయ్యాలు. నవ్వుల కథ

ప్రొడ్యూసర్ 'గురువిందరావు' ఇప్పటికి నాలుగు సినిమాలు తీసాడు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆఖరి ప్రయత్నంగా తన దగ్గర మీగిలిన నాలుగు కోట్లతో ఇంకో సినిమా తీసి, గౌరవంగా ఫీల్డ్ నుంచి పరరైపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకూ తన సినిమాల్లో లవ్, క్రైమ్, సెంటిమెంట్, ఫ్యాక్షన్ లాంటి ఎలిమెంట్స్ అన్ని టచ్ చేసాడు కానీ ' హర్రర్ ' ఎలిమెంట్ ని టచ్ చేయలేదు. అదే ఆలోచనలో వంటరిగా బల్కానిలో ఫుల్ బాటిల్ ముందు కట్టేసిన గురువిందరావుకి గాల్లో కొన్ని ఆకరాలు తెలుగుపోతున్నట్ట్లుగా కనిపించాయ్. మందులో ఉన్నా ఆయనకు అవి మేఘాల ని తెలిలేదు. గ్లాసు తీసుకుందామని చేయి కిందకు పెడితే అక్కడ ! గ్లాసు లేదు. " నేనెప్పుడూ కుడిచేత్తోనే తగుతనే ! ఎడమచేతి దగ్గర ఉందేంటి గ్లాసు " అనుకుంటూ సిగరెట్ వెలిగించి అగ్గిపుల్లను కింద పడేసాడు. అది పడ్డచోట భగ్గున మంట వచ్చి ఆరిపోయింది. నో డౌట్.. ఇది ఈవిల్ పవర్ " అనుకున్నాడు. నిజానికి అగ్గిపుల్ల పడ్డచోట కొంత మందు వలికి ఉండడంతో మంట వచ్చిందన్న సంగతి అయన గ్రహించ లేదు. అంతలో తీతవు పిట్ట అరవడంతో 'హర్రర్ ' సినిమా తీయడానికి డిసైడ్ అయపోయాడు. ఓ దర్శకుడిని కలిసాడు. "మిస్టర్ గురువిందరావు ! నా డైరక్షన్ లో సినిమా తియడమంటే కందహార్ టెర్రరిస్ట్ లతో కబ్బడి ఆడుకున్నట్లే. బెడ్జేట్ అంటే లెక్క చేయనివాల్లె నాతో సాహసం చేస్తారు. పైగా సినిమా తెస్తున్న టైంలో ఎ దావూద్ ఇబ్రహీంలాంటివాడో చందా ఇమ్మని ఫోన్ చేస్తాడు. ఇవన్ని నువ్వు తట్టుకోలేవు. నీ బోడి బెడ్జేట్ కి నా అసిస్టెంట్లు లో తలమాసినోడొకడు సరిపోతాడు తిసుకోపో " అన్నాడాయన. అయన అసిస్టంట్ బృందం లో నిర్లక్షంగా, రెక్లేస్స్ గా ఉన్నా 'పోతురాజు' అనే కుర్రాడ్ని సెలెక్ట్ చేసుకున్నాడు గురువిందరావు. " మనం తెసేది హర్రర్ సినిమా కాబట్టి ఏదన్న స్మశానం పక్కన ఆఫీసు తియమన్నాడు" పోతురాజు. వెంటనే పంజ గుట్ట స్మశానం గోడకు అనుకోని నిర్మించిన భవనంలో ఆఫీసు తీసాడు ప్రొడ్యూసర్. పదమూడో తారీఖు, అమావాస్య, ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో ఓ మాంత్రికుడితో కపాలం బద్దల కొట్టించి ( కొబ్బిరికాయ బదులు పాత కపాలం ) ఆఫీసులో దిగారు. ఆ రాత్రే కథ చెబుతానని ప్రొడ్యుసర్ని స్మశానంలోకి తీసుకొచ్చాడు పోతురాజు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడని ప్రొడ్యూసర్ అగ్గి పెట్టె ఇవ్వబోయాడు. " మనం తీసేది హర్రర్ సినిమా సార్" అంటు పోతురాజు వెళ్లి అక్కడ కాలుతున్న చితి నిప్పులతో సిగరెట్ మంటించాడు. చలిగా ఉండటంతో ఇద్దరు శవం కాలుతున్న మంట దగ్గరే కూర్చున్నారు. పోతురాజు చెప్పే కథ వింటుంటే గురువిందరావుకి వెన్నులోంచి చలి పుట్టింది. " చిన్నపిల్లకు చేతబడి చేసారెవరో... ఆ పిల్ల తన తండ్రిని, తల్లిని పికపిసికి చంపేసింది. ఇక ఆ ఇంట్లో ఆరుగురు మిగిలారు " అని డిరెక్టర్ చెబుతుండగా కాలుతున్న శవానికి కపాల మొక్చమయ్యి దాని పుర్రె 'డాం' అని పగలిపోవడంతో నిప్పులు ఎగసి గురువిందరావు మీద పడ్డాయ్. "మిగితా కథ వినే ధైర్యం నాకు లేదు బాబూ! దయచేసి సినిమా ప్రారంబించేయ్" అని గురువిందరావు దణ్ణం పెట్టేశాడు. అమావాస్య రోజు షూటింగ్ ప్రారంభించారు. అరవై శాతం సినిమాని వివిధ స్మసనాల్లో పూర్తీ చేసారు. సమాదుల్లోంచి దెయ్యాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసినట్లుగా ఐటం సాంగ్ కూడా చేసారు. రీ-రికార్డింగ్ అయెతే ముంబై తెసుకెళ్ళి అరుపులు.కేకలతో చేఎంచుకోచ్చారు. ఫస్ట్ కాపి రెడి అయంది. ప్రివ్యూకి పిలిచినా ఎవ్వరూ భయపడి రారని... డైరెక్ట్ గా సినిమాని రిలీజ్ చేసేసారు. సినిమా రిలీజ్ అయ్యి రెండ్రోజులైన జనం పలుచగానే ఉన్నారు తప్ప హౌస్ ఫుల్ కావడం లేదు. సినిమా ఎలా ఉన్నా జనం రావాలంటే ప్రచారం కావాలి కాబట్టి " వంటరిగా మా సినిమా చుస్తే ఆరు lacks బహుమతి " అని ప్రకటించారు. ఆరో తరగతి చదివే ఓ కుర్రాడు సెకెండ్ షోని వంటరిగా, నవూతు చూసి ఆరు lacks పట్టుకోపోయాడు. ఆ కుర్రాడ్ని యందుకు భయపడలేదని అడిగితే " ఎముందంకుల్. నేను ఆడుకునే వీడియో గేమ్స్ లో యంత హర్రర్ ఉంటుందో మికేంతెలుసు ! దానికన్నా గొప్పదా మీ సినిమా " అన్నాడు వాడు. " మా సినిమా చూస్తున్నప్పుడు ధియేటర్ లో మీకు నిజంగా దెయ్యాలు కనబడతాయ్. మీ పక్కనుండే వేలతాయ్" అని ప్రచారం ఇచ్చి సినిమా హల్లో లైట్ లన్ని ఆర్పేసి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ దెయ్యాల వేశాలేసుకొని సడన్ గా జనం మధ్యకెళ్ళి భయపెట్టారు. ఇంటెర్వల్ తర్వాత చిన్న పిల్లలు గుండు సూదులు తెచ్చి దెయ్యాల పిర్రలమిద గుచ్చడంతో ఆ ప్రచారం మానుకున్నారు. సెకండ్ షో సినిమా చూస్తున్న ఆడియన్స్ తెల్ల చొక్కామీద ఇంక్ ఫిల్లర్స్ తో రెడ్ ఇంక్ తీసుకోని దొంగచాటుగా చల్లాడు గురువిందరావు. ఇంటెర్వల్ లో తమ చొక్కలమిద రక్తపు మరకలేంటి అని కొంత మంది కంగారు పడ్డారు. దాన్నే ప్రచారంగా వాడుకోవాలని.. ఇంటెర్వల్ తర్వాత ఇంక్ చల్లుతూ ఆడియన్స్ కి దొరకిపోయే తన్నులు తిన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఇలా ధియేటర్ లో కాదు, బయట ఏదన్న చేసి సినిమా ఆడించాలని అర్థరాత్త్రుల్లు దెయ్యాల వేషాలతో ఆటోలో తిరుగుతూ బిక్షగాల్లకు కనపడ్డారు. " ఆటోల్లో తిరుగుతూన్న దెయ్యాలు " అని అని టీవీలో స్క్రోలింగ్ చూపించారు. దాంతో పోలీసులు నిఘా వేసి టాక్సీలో వస్తున్న దెయ్యలమిద కాల్పులు జరిపారు. " బుద్ది లేదా మీకు ! ప్రచారం కోసం ఇంత నుసేన్స్ చేస్తారా ? ఇంక నయం, మావాళ్ళు కారు టైర్ల మీదే కాల్పులు జరిపారు" అంటు ఇద్దర్ని తిట్టి పంపించేసాడు పోలీస్ ఆఫీసర్. వారం రోజుల్లో ఫ్లాప్ అని తేలడంతో సినిమాని ఎత్తేసారు. ఇక గురువిందరావు తన సొంతూరు పెంటపాడు వేల్లిపోయ్, తన సిమెంట్ గొట్టాల వ్యాపారాన్ని మళ్ళి ప్రారంబించాడు. గమనిక :ఈ కథ ఓ ప్రముఖ దినపత్రిక లోంచి సేకరించడం జరిగింది.

No comments:

Post a Comment

thanks to comment on my blog.